
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సమంత. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతి తక్కువ సమయంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని, స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

ఇక నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ నటి, పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయిన విషయం తెలిసిందే.డివోర్స్ తర్వాత నుంచి సమంత నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి సంబంధించిన ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

ఇక డివోర్స్, మయోసైటీస్ తర్వాత సమంత చాలా రోజుల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న విషయం తెలిసందే.ఇక ఈ మధ్య సెకండ్ హిన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయిపోయింది.ముఖ్యంగా ఈ నటి ట్రలాలా అనే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే తన నిర్మాణ సంస్థ నుంచి శుభం అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు అదిపోయే లుక్ లో ఉన్న ఫొటోలు షేర్ చేసింది.

బ్లూ కలర్ డ్రెస్ లో జ్యువెల్లరీ ధరించి ఉన్న ఫొటోలను ఈ అమ్మడు షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత చాలా అందంగా అచ్చం అప్సరలానే కనిపిస్తుంది.