
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత.. అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే..! సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో..? ఏదైనా అంటారేమో..? అంటూ తెగ వేతికారంతా. కానీ ఎక్కడా నోరు జారలేదు స్యామ్.

చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారీమె. మరి అక్కడేం జరిగింది..? సమంత రియాక్షన్ ఏంటి..? సమంత ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని మీడియా వేచి చూస్తుంది. కానీ ఇక్కడ రాలేదు కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చారు స్యామ్.

వరల్డ్ పికిల్బాల్ లీగ్ అనే ఓ స్పోర్ట్స్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చారు ఈ భామ. తన పర్సనల్ లైఫ్ను ఏ మాత్రం టచ్ చేయకుండా.. మిగిలిన విషయాలన్ని మాట్లాడేసారు స్యామ్. చైతూ నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావడం.

దానికితోడు సమ్థింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించడంతో ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నారని ఊహించారంతా. కానీ ఏం లేదు.. సింపుల్గా వరల్డ్ పికిల్బాల్ లీగ్లో చెన్నై టీంను కొనుగోలు చేసారు సమంత. ఆ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా.. నాకు పికిల్బాల్ను చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అన్నారు సమంత. అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్కి బైబై చెప్పారు స్యామ్. ప్రస్తుతం సిటాడెల్తో పాటు మమ్ముట్టితో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ అనే మరో సిరీస్కు కమిటయ్యారు సమంత.