
కెరటం సినిమాతో వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరస సినిమాలతో టాలీవుడ్నే షేక్ చేసింది.

కరెంట్ తీగ, సరైనోడు, ధృవ, కిక్2 బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ కూడా తన గ్లామర్తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరో వైపు బిజినెస్లు చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తుంది.

అయితే తాజాగీ ఈ బ్యూటీ తన భర్త, ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మాల్దీవ్స్ వెకేషన్కు వెళ్లింది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.

రకుల్ బీచ్లో తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, అలాగే, రిసాట్లో తన భర్తతో దిగిన ఫొటోస్, ఫ్యామిలీతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్, బీచ్లో రకుల్ గ్లామర్తో చెమటలు పట్టిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.