
చెప్పడానికేం లేదు.. ఒకటే మాట.. కొన్నేళ్ళుగా తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డేకు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. చెప్పుకోడానికి హిట్స్ లేవు.. చేతిలో సినిమాల్లేవు.. చేసిన సినిమాలు ఆడట్లేదు.. ప్రస్తుతం ఇదే పూజా కెరీర్.

కానీ మిగిలిన చోట్ల పర్లేదు.. తమిళంలో విజయ్తో జన నాయగన్, రజినీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు పూజా.. అలాగే హిందీలోనూ అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. కాంచన 4లోనూ పూజానే హీరోయిన్గా తీసుకున్నారు లారెన్స్.

తమిళంలో బిజీగానే ఉన్నా.. తెలుగులో మాత్రం పూజాను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆ మధ్య నాగ చైతన్య, విజయ్ దేవరకొండ సినిమాలు వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యాయి. దాంతో డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు బుట్టబొమ్మ.

కాజల్, తమన్నా నుంచి సమంత, కీర్తి సురేష్ లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ వరకు అంతా వెబ్ సిరీస్లపై ఫోకస్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా నెట్ ఫ్లిక్స్ కోసమే ఓ వెబ్ సిరీస్ సైన్ చేసినట్లు తెలుస్తుంది.

తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సిరీస్ను రూపొందిస్తున్నారు. డిమోంటి కాలనీ, కోబ్రా లాంటి సినిమాలు చేసిన అజయ్.. పూజా కోసం ఓ కథ సిద్ధం చేసారు. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్తో బిజీ కానున్నారు ఈ బ్యూటీ. మరి పూజా హెగ్డే డిజిటల్ జర్నీ ఎలా ఉండబోతుందో చూడాలి.