
నేహా ధూపియా 2003లో ‘ఖయామత్’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ‘జూలీ’, ‘శిఖర్’, ‘చుప్ చుప్ కే’, ‘షీషా’, ‘ఫ్యాన్స్ గయే రే ఒబామా’, ‘దే దానా దాన్’, ‘రే రగిలే’, ‘బాడ్ న్యూస్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ చాలా ఫెమస్..

అన్నట్లు నేహా ధూపియా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. తరుణ్ నిన్నే ఇష్టపడ్డానులో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. రాజశేఖర్ విలన్ లో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలకృష్ణ పరమ వీర చక్ర సినిమాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఆతర్వాత తెలుగులో నటించలేదు నేహా.

ప్రస్తుతం ఈ అందాల తార సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటోంది. అలాగే పోడ్కాస్ట్ లో ప్రముఖులను కూడా ఇంటర్వ్యూ చేస్తోంది. 2018 మే 10న నేహా ధూపియా, అంగద్ బేడీ గురుద్వారాలో వివాహం చేసుకున్నారు.

తాను పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడంతో హడావుడిగా పెళ్లి జరిగిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో నేహా చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. తల్లి తండ్రుల ఒత్తిడితో 72 గంటల్లోనే ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కింది ఈ స్టార్ హీరోయిన్.

పెళ్లయిన ఆరు నెలలకే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఆమె పై ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. తాజాగా నేహా మాట్లాడుతూ.. నేను పెళ్ళికి ముందే తల్లినయ్యా.. అందులో తప్పేముంది. నేను మాత్రమే కాదు పెళ్ళికి ముందే గర్భం తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ నెటిజన్స్ నన్నే టార్గెట్ చేసి ట్రోల్ చేయడం బాధిస్తుంది.