టాలీవుడ్ సీనియర్ నటీనటులు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ మధ్య ఓ వీడియో విడుదల చేశారు కూడా. అందరూ అది నిజమనే అనుకున్నారు. కానీ ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాత వెల్లడించారు.
పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమే ‘మళ్లీ పెళ్లి’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ విడుదలైంది.
తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు టీజర్ చూస్తే తెలిస్తోంది.
విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మిస్తున్న ‘మళ్ళీ పెళ్లి’ మువీకి ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది . ఈ మువీలో జయసుధ, శరత్బాబు, వనిత విజయ్కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ తదితరులు నటించారు.
నరేష్-పవిత్రల మళ్లీ పెళ్లి టీజర్ ఈ అంచనాలను రెట్టింపు చేసింది. అయితే, ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తుండగా, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. నిజ జీవిత సంఘనలను రీల్పై చూపెడుతున్న ఈ సినిమాలో ఎలాంటి వివాదాలను ప్రస్తావిస్తారో అని అందరూ ఆసక్తిగా ఓ వైపు ఎదురు చూస్తుంటే.. మరోవైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో సాగుతోంది.