
2021లో సంచలన విజయం సాధించిన తెలుగు సినిమాల్లో ‘అఖండ’ ఒకటి. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో డబ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను హిందీలో విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ ‘అఖండ’ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

జనవరి 20వ తేదీన హిందీ థియేటర్లలో అఖండ డబ్ వెర్షన్ సందడి చేయనుంది. దీనికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. హిందూత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ-2’ సూపర్ హిట్ అయింది కాబట్టి ‘అఖండ’ కూడా బ్లాక్బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హీరోయిజం ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న సినిమాలకు హిందీలో బ్రహ్మరథం పడుతున్నారు. ‘అఖండ’లో బోయపాటి, బాలయ్య మాస్ కాంబినేషన్కు థమన్ అదిరిపోయే రీ-రికార్డింగ్ తోడయింది.

ఇక తెలుగునాట కూడా ఈ సంక్రాంతికి బాలయ్య ‘వీర సింహా రెడ్డి’గా రాబోతున్నారు. క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించారు.

2021లో విడుదలైన ‘అఖండ’.. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తెలుగు చిత్రం. అలాగే బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా కూడా ‘అఖండ’ నిలిచింది.

‘అఖండ’ తెలుగు వెర్షన్ డిసెంబర్ 2, 2021న విడుదలైంది. యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 120.8 కోట్లు వసూలు చేసింది.