
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్. మొదటిసారి రామ్ చరణ్ తో కలిసి ఈ అమ్మడు స్టె్ప్పులేయనున్నట్లు తెలుస్తోంది.

దీంతో వీరిద్దరి కాంబోను తెరపై చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పెద్ది చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలల ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

పెద్ది సినిమాలో రాబోయే స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు. మొదట్లో పెద్ది సినిమాలో రష్మిక మందన్న స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ నడించింది. కానీ ఇప్పుడు మృణాల్ పేరు తెరపైకి వస్తుంది. రష్మిక బిజీగా ఉండడంతో మృణాల్ పేరు వినిపిస్తుంది.

అంతేకాదు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి మృణాల్ దాదాపు రూ.3 కోట్ల పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మృణాల్ తెలుగులో డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.