
కొన్ని సంవత్సరాలుగా స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కరుణ భూషణ్. అప్పట్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె..ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు వంటి చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.

అంతేకాదు.. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత వైదేహి పరిణయం సీరియల్లోనూ కనిపించింది. తెలుగులో పలు సీరియల్స్ చేసింది. అభిషేకం సీరియల్లో కరుణ అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అలాగే పాజిటివ్ పాత్రలతోనే కాకుండా వైదేహి పరిణయం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. కరుణ భూషణ్ ముగ్గురు పిల్లలకు తల్లి. సీరియల్స్ కు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా చీరకట్టులో వర్షంలో తడుస్తూ ఫోటోషూట్ చేసింది కరుణ. ఈ ఫోటోస్ నెట్టిటం షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరలవుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది.