
ప్రెజెంట్ యూత్ క్రష్ కాయదు లోహర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్పూర్లో జన్మించింది

2021లో పూణే ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది కాయదు లోహర్, ఇదే ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. 2021లో కన్నడ చిత్రం "మొగిల్పేట"తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. "పాథోన్పథం నూట్టండు" (2022) చిత్రంతో మలయాళంలో సూపర్ హిట్ అందుకుంది.

తాజాగా వచ్చిన డ్రాగన్ సినిమాతో బాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో కాయదు గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. ప్రస్తుతం తెలుగు, మరాఠీ, తమిళ్ చిత్రాల్లో బిజీ అయ్యిపోయింది. "థారం" మరియు "ఇధయం మురళి" వంటి చిత్రాలతో మరింత బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులో విశ్వక్సేన్ అనుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ కాయదు లోహర్ హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ సీనియర్ హీరో శింబు 49వ చిత్రంలోనూ ఆమె హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. టాలీవుడ్, కోలీవుడ్లలో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. పారితోషికం కూడా భారీగా పెంచినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది ఈ చిన్నది.తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో ఫుల్ వైరల్ అవుతున్నాయి.