
ఛావా సినిమా దుమ్ము దులిపేస్తోంది. ఎన్నాళ్లుగానో వెయిట్ చేసిన హిట్ ఇదే కదా అంటూ బాలీవుడ్ అంతా సందడిగా కనిపిస్తోంది. ఫస్ట్ డే 33 కోట్లు కలెక్ట్ చేసిందన్నది వారి ఆనందానికి కారణం.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సిన సినిమా రకరకాల రీజన్స్ తో పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. ఛావా సినిమాలో శంభాజీ మహారాజ్ సతీమణి ఏసుబాయి కేరక్టర్ చేశారు రష్మిక మందన్న.

ఈ కేరక్టర్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడి ప్రమోషన్లలో పాల్గొన్నారు. అయితే చావా ఆల్బమ్ రిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నడిగుల ఆగ్రహానికి రీజన్గా నిలిచాయి.

ఇంతకీ నేషనల్ క్రష్ సొంత గూటి జనాలు ఎందుకు గుస్సయినట్టు... అదీ సంగతి... నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పారు రష్మిక మందన్న. విరాజిపేట గుర్తుకురాలేదా? కొడగు జిల్లానెలా మర్చిపోయావ్. నీ ప్రస్థానం కన్నడ ఇండస్ట్రీలో మొదలు కాలేదా? నువ్వు కర్ణాటక అమ్మాయివి కాదా అంటూ రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యానిమల్ గర్ల్ మీద.

ఏడాదికి ఓ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇవ్వడం అంత తేలిక కాదు. ఆ మధ్య యానిమల్, లాస్ట్ ఇయర్ పుష్ప2, ఇప్పుడు ఛావా.. ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రష్మిక.. తన కన్న ఊరిని ఎప్పుడూ మర్చిపోలేదు. కొడగును గుర్తుచేసుకుంటూనే ఉన్నారని ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు మరికొంతమంది. ఏదేమైనా మన శ్రీవల్లి ఫ్రమ్ హైదరాబాద్ అన్నందుకు తెలుగువారు మాత్రం ఫుల్ హ్యాపీస్ అండోయ్.