
సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి టాప్ హీరోయిన్గా ఎదిగింది ఐశ్వర్య మీనన్. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు బ్యా్క్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పుడు కార్తీకేయ నటించిన భజే వాయువేగం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా మే 31న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా భజే వాయువేగం ప్రమోషన్లలో పాల్గొ్ంటున్న ఐశ్వర్య ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తమిళనాడులోని ఈరోడ్ అనే చిన్న సిటీలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చానని.. తమ ఇంట్లో ఎవరికీ మూవీ బ్యాగ్రౌండ్ లేదని చెప్పుకొచ్చింది. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ వయ్యారి స్కూల్ డేస్ లోనే పలు యాడ్స్ లో నటించిందట.

అలాగే యాడ్స్ చేస్తూ.. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడంతో మరింత గుర్తింపు వచ్చిందని తెలిపింది. దీంతో ఇంజనీరింగ్ అయ్యాక యాక్టింగ్ మీద ఫోకోస్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.

దాదాపు పదేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని.. ఇప్పటివరకు తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే తాను భారతనాట్యం డ్యాన్సర్ అని.. చిన్నప్పుడు స్కూల్, కాలేజీలో చాలా పర్ఫార్మెన్స్ లు ఇచ్చినట్లు తెలిపింది.