
ఒకప్పుడు ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందం, అమాయకత్వం.. అంతకు మించిన అల్లరితనంతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన ఫస్ట్ మూవీ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. జెనీలియా. 1987 ఆగస్ట్ 5న ముంబైలో జన్మించిన ఈ అమ్మడు తుఝే మేరీ కసమ్ (నువ్వే కావాలి రీమేక్) సినిమాతో కథానాయికగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఈ సినిమాలో బీటౌన్ స్టార్ రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన బాయ్స్ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

సిద్ధార్థ్ హీరోగా నటించిన బొమ్మరిల్లు సినిమాతో జెనీలియా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో తన అద్భుతమైన నటనతో మెప్పించింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది.