
సినీరంగంలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం భాషలలో పలు సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినిమా పరిశ్రమలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చింది. కట్ చేస్తే తక్కువ సమయంలోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. 2017లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంది.

ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ అయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్ని ప్రారంభించింది.

అదే ఏడాది మాయనది సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు ఆమె ఫిల్మ్ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ఐశ్వర్య నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.