ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. నిత్యం పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో సెలబ్రెటీల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమెను చూస్తేనే ప్రేమలో పడిపోతారు. ఆమె నటిస్తుంటే మన పక్కింటి అమ్మాయిలనే అనిపిస్తుంది. ఆమె నటనకు అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
ఆమె మరెవరో కాదు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి 2008లో జయం రవి, కంగనా జంటగా నటించిన ధామ్ ధూమ్ చిత్రంలో బాలనటిగా చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
ఫిదా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో తొలి సినిమాతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆమె పూర్తి పేరు సాయి పల్లవి సెంతామరై. వైద్య విద్యను పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
సాయి పల్లవి వెండితెరపైకి రాకముందు స్మాల్ స్క్రీన్పై చాలా డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. ముఖ్యంగా ఢీ అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది. ఆతర్వాత సాయి పల్లవి అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో నటుడు నివిన్ పౌలీ నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ లో హీరోయిన్గా అరంగేట్రం చేసింది
చివరిగా గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో నటి సాయి పల్లవి నటించిన గార్గి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రానికి గాను ఆమె 3 ఉత్తమ నటి అవార్డులను కైవసం చేసుకుంది. ఇప్పుడు నాగ చైతన్యతో తండేల్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుపుకుంటోంది.