డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దొచేసిన ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో పలు చిత్రాల్లె సెకండ్ హీరోయిన్గా కనిపించింది.
2023లో వచ్చిన హిట్ సినిమా ‘ది కేరళ స్టోరీ’ మూవీతో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది. ఇందులో అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించింది. విడుదలకు ముందే వివాదాస్పదంగా నిలిచిన ఈ సినిమాలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆదా శర్మ.
కేరళ స్టోరీ సినిమా తర్వాత అదా శర్మకు భిన్నమైన గుర్తింపు వచ్చింది. అదా శర్మ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు అదా శర్మ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఇటీవలే బస్తర్ ది నక్సల్స్ స్టోరీ అనే చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది.
ఇప్పటివరకు ఆదా శర్మ రూ. 10 నుంచి 12 కోట్ల వరకు సంపాదించినట్లుగా తెలుస్తోంది. అలాగే ముంబైలో విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇప్పుడిప్పుడే తన సినిమాలకు రెమ్యునరేషన్ పెంచే ఆలోచనలో ఉంది ఆదా శర్మ.
సోషల్ మీడియాలో ఆదా శర్మ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది.