2016లో మరాఠీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన చిత్రం సైరాట్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రభంజనం క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా దాదాపు 100 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ మూవీతో హీరో ఆకాష్, హీరోయిన్ రింకు రాజ్ గురు స్టార్ డమ్ అందుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆర్చీ పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకుంది రింకు రాజ్ గురు.
16 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన రింకు రాజ్ గురు.. సైరాట్ సినిమాతో కథానాయికగా పరిచయమయ్యింది. తొలి సినిమాకే సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. విశ్వక్ సేన్ నటించిన తొలి చిత్రం వెళ్లిపోమాకే సినిమాకు దర్శకత్వం వహించిన యాకూబ్ అలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా రింకు రాజ్ గురును సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఈ సినిమాను రాకేష్ వర్రే తన హోమ్ బ్యానర్ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నారట.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరో గురించిన వివరాలు తెలియరాలేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న 'సైరాట్' హీరోయిన్.. హీరో ఎవరంటే..