
చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఆలోచనలో పడ్డారు చిరు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్నగర్లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్లో శరవేగంగా జరుగుతోంది.

ఇంద్ర మూవీకి సీక్వెల్ కావాలని మణిశర్మ అడగడం, వెంటనే దానికి చిరంజీవి ఓకే చెప్పేయడం, అశ్వనీదత్ యస్ అనడం.. అంతా వేగంగా జరిగిపోయింది.

అసలే సీక్వెల్స్ సందడి చేస్తున్న వేళ ఇంద్ర సీక్వెల్ వస్తే.. ఆ హైప్ ఇంకో రకంగా ఉంటుందిగా. ఇంద్ర గురించి ప్రస్తావన రాగానే, చిరంజీవి మనసులో మెదిలిన మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి.

ఈ సినిమాకు సీక్వెల్ చేయమని మెగాస్టార్ స్వయంగా కోరడం కూడా ఫ్యాన్స్ కి ముచ్చటేసింది. జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్లో రామ్చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తే చూడాలని ఉందని చాలా సార్లు చెప్పారు చిరు.

మరి ఇప్పుడు వైజయంతీ మూవీస్ కూడా అదే విషయాన్నే కన్సిడర్ చేస్తుందా.. లేకుంటే, సరికొత్తగా ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా.. లెట్స్ వెయిట్ అండ్ సీ..