
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంది అందాల భామ షాలిని పాండే. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. ఈ సినిమాతర్వాత కుర్రాళ్లు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల భామ.

షాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. దాంతో పెద్దగా కనిపించలేదు ఈ చిన్నది. ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది దాంతో టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.

శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

మహానటి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఎన్.టి.ఆర్. కథానాయకుడు , 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాల్లో మహానటి, 118 సినిమాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఆతర్వాత తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసింది. అక్కడ పెద్దగా ఈ అమ్మడు క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు పిచ్చిలేస్తుంది. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది.