
బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ సంపాదించుకున్న స్రవంతి.. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, షోస్ అంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగే అటు సోషల్ మీడియాలో రెగ్యులర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. గ్లామర్ ఫోటోషూట్లతో హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

యాంకర్ స్రవంతి.. ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న యాంకర్. ఇప్పుడు నటిగానూ అలరించేందుకు రెడీ అయ్యింది. హే బల్ వంత్ సినిమాలో కీలకపాత్రలో నటించింది. ఈ సినిమాను ఈనెల 20న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది స్రవంతి.

కర్నూల్, అనంతపూర్ వైపు మాస్ క్రౌడ్ ఉంటుందని.. ముఖ్యంగా కాలేజీ వేడుకలకు అందరూ అబ్బాయిలే వస్తారని..కేవలం ఒక హీరో మాత్రమే వస్తాడని అన్నారు. లేడీ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండరని.. కేవలం యాంకర్ మాత్రమే ఉంటుందని .. అలాంటి ఈవెంట్స్ నుంచి బయటపడితే చాలు అనిపిస్తుందని తెలిపింది.

ఒక ఈవెంట్ లో తన చెయ్యి పట్టుకుని డైమండ్ రింగ్ లాగేసారని తెలిపింది. తన రింగ్ పోయిందని.. అలాగే చున్నీ సైతం చిరిగిపోయిందని తెలిపింది. అలాంటి పరిస్థితులు చూశానని.. అక్కడ మనం ఏం చేయలేమని చెప్పుకొచ్చింది.

ఒకసారి తన అసిస్టెంట్ ఫోన్ పోయిందని.. విరూపాక్ష ప్రమోషన్లకు వెళ్లినప్పుడు దాదాపు 500 మంది అబ్బాయిలు తన చుట్టూ ఉన్నారని.. ఆ సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారని.. ఆ రోజు ఆయన లేకపోతే నతకు కష్టమే అని తెలిపింది.