14 మే 1994న తమిళనాడులోని చెన్నైలో తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్. కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. ఆమె సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత మోడల్గా మారి తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్ను కొనసాగించింది.
2014లో లింగా, తెనాలిరామన్; 2016లో పొక్కిరి రాజా, తేరి వంటి చిత్రాల్లో అనేక గుర్తింపు లేని పాత్రల్లో నటించింది ఈ అమ్మడు. 2018లో విజయ్ యేసుదాస్ సరసన పడైవీరన్ ప్రధాన నటిగా అరంగేట్రం చేసింది, అక్కడ ఆమె మలర్ పాత్రను పోషించింది.
తర్వాత కాళిలో విజయ్ ఆంటోని సరసన ప్రధాన పాత్ర పోషించింది. 2019లో వినయ్ రాజ్కుమార్ నటించిన గ్రామాయణంతో కన్నడలో అరంగేట్రం చేయాల్సింది. కానీ నిర్మాతకు కోవిడ్ రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. అదే ఆమె అట్లీ దర్శకత్వంవచ్చిన విజయ్ దళపతి బిగిల్ సినిమాలో తమిళనాడు ఫుట్బాల్ జట్టు కెప్టెన్ తెండ్రాల్ పాత్రను పోషించింది.
2021లో కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన రెడ్లో రామ్ పోతినేని సరసన తెలుగు చలనచిత్ర అరంగేట్రం చేసింది. అదే ఏడాది తెలుగు స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఏడాది విష్ణు సరసన అర్జున ఫాల్గుణ మూవీలో నటించింది.
2024లో సంక్రాంతి కనుక జనవరి 12న విడుదలైన తెలుగు సూపర్ హీరో చిత్రం హనుమాన్ సినిమాలో తేజ సజ్జకి జోడిగా కథానాయకిగా నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఈ ఏడాది సంక్రాంతి విన్నర్గా నిలిచింది. అదే ఏడాది బచ్చలమల్లి సినిమా అల్లరి నరేష్ సరసన ఆకట్టుకుంది ఈ బ్యూటీ.