
సొసైటీ బాగు కోసం ముందడుగు వేస్తూ తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA). కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో 820 స్కూల్ అవేర్ నెస్ ఈవెంట్స్ కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మద్ధతుగా నిలిచింది. ఈ కార్యక్రమాల ద్వారా 3 లక్షలమంది యువతులకు చేరువైంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ వంటి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరుగా స్కూల్స్, కమ్యూనిటీల్లో ఈ అవగాహన కార్యక్రమాలను ఎఎఎఫ్ఎ నిర్వహించింది. సామాజిక బాధ్యత గల అల్లు అర్జున్ అభిమానులంతా సమష్టి కృషితో ఈ ఘనతను సాధించారు.

హెచ్ పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించడంలో బాలికలకు, యువతులకు ఆరోగ్యకరమైన భవితను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఒక గొప్ప లక్ష్యంతో ఈ కార్యక్రమం కోసం కోసం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానుల ఒక్కటవడం విశేషం.

ఈ క్రమంలోనే 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలికలకు HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యనతు వివరించారు. సరైన వయసులో వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో హెచ్ పీవీ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి కుటుంబం ఈ వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకుని.. డాక్టర్ల సలహా మేరకు పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇందులో రష్మిక, మృణాల్ సైతం కనిపించనున్నారని టాక్.