
ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. తన కూతురితో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది.

అలాగే లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ మన సంప్రదాయలకు ఎంతగా విలువ ఇస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా పట్టుచీరలో మరింత అందంగా ముస్తాబయ్యింది ప్రణీత.

పసుపు రంగు పట్టుచీరలో బంగారు ఆభరణాలు ధరించి అచ్చం మహాలక్ష్మిగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బాపుగారి బొమ్మ కుందనపు బొమ్మలా ఉందంటున్నారు.

ప్రణీత సుభాష్.. 1992 అక్టోబర్ 17న బెంగుళూరులో జన్మించింది. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత బావ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీతకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. కానీ కొన్ని సందర్భాల్లో సెకండ్ హీరోయిన్ గానూ నటించి అలరించింది.

బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం 2021లో జరిగింది. గతేడాది జూన్ 10న పండండి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

ప్రస్తుతం ప్రణీత తన కూతురితో సమయాన్ని గడుపుతూనే.. మరోవైపు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రణీత ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.