
ప్రస్తుతం ఈ అమ్మడు టర్కీలో ప్రకృతితో ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన పరిణీతి.. ఆమె సినీ జర్నీ, సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకోచ్చింది. అనుష్క శర్మ తన లేడీ క్రష్ అని తెలిపింది. బ్యాండ్ బాజా బారత్ సినిమా ఇంటర్వ్యూల కోసం అనుష్క డేట్స్ తానే చూసుకున్నానని తెలిపింది.

అదే సమయంలో అనుష్కకు పీఆర్ గా పనిచేసానని.. ఆ తర్వాత కేవలం మూడు నెలల్లో ఆమెతో నటించే స్థాయికి ఎదిగానని చెప్పుకోచ్చింది. అలా లేడీస్ వర్సెస్ రికీ బహల్ సినిమాకు తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నానని తెలిపింది.

అలాగే ఈ 2021 తనకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకోచ్చింది అనుష్క. నెల రోజుల వ్యవధిలో రిలీజైన మూడు సినిమాలు (సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా, ద గర్ల్ ఆణ్ ద ట్రైన్) సూపర్ హిట్ అందుకున్నాయని తెలిపింది.

ఇక రాబోయే రోజులలో కూడా అన్ని మంచి పాత్రలే చేయాలనుకుంటున్నానని తెలిపింది. ప్రస్తుతం పరిణీతి చోప్రా.. రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమాలో నటిస్తోంది.

ఫరిణితి చోప్రా..