
మీరు ఇంతవరకు ఇలాంటి బిర్యానీని తిని ఉండరు ఇలా చేస్తే నాటుకోడిని తలదన్నే రుచి వస్తుంది. మీ ఇంట్లో ఇలా చేస్తే అసలు వదిలిపెట్టరు. ఒకసారి తింటే మళ్ళీ మళ్లీ తింటూనే ఉంటారు. ఈ టేస్ట్ కి ఎవరైనా ఫిదా పడి పోవాల్సిందే. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

బిర్యానీకి కావాల్సిన పదార్దాలు: కేజీ చికెన్, రెండు కప్పుల బాస్మతి బియ్యం, మూడు ఉల్లిపాయలు , రెండు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా , ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

బిర్యానీ తయారీ విధానం : ముందుగా మీరు చికెన్ తీసుకుని దానిలో కొంచం పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి 15 నిమిషాలు మారినేట్ చేయాలి. బాస్మతి బియ్యాన్ని కడిగి 10 నిమిషాలు నానబెట్టాలి.

బిర్యానీ తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో కొంచం ఉప్పు, ఆయిల్, ఇంకా మసాలా దినుసులు వేసి బియ్యాన్ని కూడా దీనిలో ఉంచి ఉడికించాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో నూనె, నెయ్యి కూడా వేడి చేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించాలి.

ఇంకా దీనిలో మూడు టమాటాలు వేస్తే మెత్తగా అయ్యాక మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై దీనిని బాగా ఉడికించాలి. ఇంకా చికెన్ గ్రేవీలా అయ్యాక బియ్యం కూడా ఉడికిన తరవాత పుదీనా, కొత్తిమీర కూడా చల్లాలి. ఇంకా మిగిలిన బియ్యం కూడా వేసి నెయ్యి, పుదీనా, కొత్తిమీర కూడా చల్లాలి.