
మహిళలు ఎక్కవగా ఇష్టపడే దాంట్లో బంగారం ముందుంటుంది. చాలా మంది బంగారం , వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా, ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే గతంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగేవి, కానీ ఈ మధ్య బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

మరి ఈ బంగారం ధరలను పెంచడం, తగ్గించడం ఎవరు చేస్తారో ఇప్పుడు చూద్దాం. చాలా మంది బంగారం ధరలను సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, మోదీ పెంచుతారని, రిజర్వ్ బ్యాంకు బంగారం , వెండి ధరలను నిర్ణయిస్తుంది అనుకుంటారు.

కానీ బంగారం వెండి ధరలను సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించదు. బంగారం, వెండి ధరల నిర్ణయించడంల కేవలం ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోషియేషన్ కీలక పాత్ర పోషిస్తుందంట. వీరే ప్రతి రోజు ధరలను పెంచడం తగ్గించడం చేస్తుంటారు.

ఐబీజేఏ అనే సంస్థ దేశంలోనే అతి పెద్ద బంగారం డీలర్స్ నుంచి కొనుగోలు, అమ్మకాలు జరుపుతుంది. వాటి అమ్మకం కోట్లను సేకరించి, వాటి సగటు ఆధారంగా బెంచ్ మార్క్ రేటును నిర్ణయిస్తుందంట. అలా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా బంగారం, వెండి ధరల నిర్ణియించడంలో స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు కూడా ఉంటాయంట. అంతే కాకుండా , వీటికి ఓ పెద్ద ఫార్ములనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మనం బంగారం ఎక్కువగా విదేశాల నుంచి కొనుగోలు చేస్తాం కాబట్టి, వాటి బులియన్ మార్కెట్ అసోసియేషన్ బట్టి, అమెరికా డాలర్ విలువలను బట్టి ధరలు నిర్ణయిస్తారు. ముఖ్యంగా లండన్ లేదా న్యూయర్ మార్కెట్లో ఔన్స్ సుమారు 31 గ్రాముల బంగారం రేటు ఎంత ఉందో చూస్తారంట. రూపాయి విలువ డాలర్స్ తో పొలిచ్చినప్పుడు తగ్గితే, బంగారం ధర పెరుగుతుందంట. ఇలా ఒక ఫార్ములాను బట్టి, బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తారంట.