
కొత్త రికార్డు.. మారుతీ సుజుకీ నుంచి ఫ్రాంక్స్ పేరుతో ఎస్యూవీ 2023 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. వచ్చిన కొద్ది కాలంలో తన సత్తా చాటింది. కేవలం 17 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల మార్కును అధిగమించింది. ఈ మైలురాయిని చేరిన అత్యంత వేగవంతమైన నెక్సా ఎస్యూవీ గా అవతరించింది. దీని తర్వాత తర్వాత గ్రాండ్ విటారా ఉంది.

ఐదు వేరియంట్లు.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కారు ప్రస్తుతం ఐదు ట్రిమ్లలో అందుబాటులో ఉంది. అవి సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా ఆల్ఫా. వీటి ధరలు రూ. 7.51 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. అధిక ఫీచర్లు కలిగిన వేరియంట్ ధర రూ. 13.04 లక్షల(ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇంజిన్ సామర్థ్యం.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది. 1.0ఎల్ బూస్టర్జెట్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ (100బీహెచ్పీ, 147ఎన్ఎం) 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. అలాగే 5-స్పీడ్తో కూడిన 1.2ఎల్ ఏఏ పెట్రోల్ ఇంజన్ (90బీహెచ్పీ) మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్బాక్స్ తో వస్తుంది.

త్వరలో హైబ్రీడ్ వెర్షన్.. మారుతీ సుజుకీ ఈ కొత్త ఎస్ యూవీని త్వరలో బ్రాండ్ ఇన్ హౌస్ హెచ్ఈవీ పవర్ ట్రెయిన్ ను ఉపయోగించి హైబ్రీడ్ వెర్షన్ తీసుకురానున్న పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే 2025 నాటికి ఫ్రాంక్స్ బలమైన హైబ్రిడ్ వెర్షన్ను పరిచయం చేసే అవకాశం ఉంది.

అదనపు ఫీచర్లు.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ అప్ గ్రేడెడ్ ఫ్రాంక్స్ లో స్విఫ్ట్ జెడ్12ఈ ఇంజిన్, చిన్న డిజైన్ ట్వీక్స్, ఇతర అదనపు ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది.