
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు మళ్లీ ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా ధరలు పడిపోతున్నాయి. భారీగా ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా తగ్గుతున్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఖరారు అవుతుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో పసిడి ధరలు పతనమవుతూ వస్తోన్నాయి.

హైదరాబాద్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,58,290 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,45,100 వద్ద ట్రేడవుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.550 పతనమైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,820 వద్ద ఉండగా.. బుధవారం రూ.870 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,500 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.800 డౌన్ అయింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,58,290గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,100గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,440 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,45,250 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.550 మేర తగ్గింది. అటు వెండి ధరలు మాత్రమే స్ధిరంగా కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.90 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.95 లక్షల వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు తగ్గింది. ఇక చెన్నైలో కూడా రూ.2.90 లక్షల వద్ద ఉండగా.. బెంగళూరులో రూ.2.85 లక్షలు వద్ద కొనసాగుతోంది.