
ఈ ఏడాది రక్షణ రంగానికి కేంద్రం పెద్దపీట వేసింది. డిఫెన్స్ మంత్రిత్వ శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6.1 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కు రూ. 2.78 లక్షల కోట్లు కేటాయించారు.

ఇక ఈ ఏడాది రైల్వేకు బడ్జెట్లో రూ. 2.55 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కు ఈ ఏడాది బడ్జెట్లో రూ. 2.13 లక్షల కోట్లు కేటాయించారు.

ఈ ఏడాది బడ్జెట్లో హాం అఫైర్స్ శాఖకు కేంద్రం రూ. 2.03 కోట్లను కేటాయించింది. అలాగే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్కు ఈసారి రూ. 1.68 లక్షల కోట్లను కేటాయించారు. రురల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖకు రూ. 1.77 లక్షల కోట్లు కేటాయించారు.

ఇక వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1.27 లక్షల కోట్లను కేటాయించారు. అలాగే మినిస్టిరీ ఆఫ్ కమ్యూనికేషన్కోసం ఈ ఏడాది రూ. 1.37 లక్షల కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగంగా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుందన్నారు. ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమని ఇస్తామని, వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యమని తెలిపారు.