Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. స్లీపర్ రైళ్ల ప్రారంభంపై బిగ్ అప్డేట్.. ఎప్పుడంటే..?

Updated on: Jan 01, 2026 | 4:10 PM

దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాాటులోకి రానన్నాయి. దీంతో రాత్రిపూట ప్రయాణం చేయాలనుకనేవారికి పెద్ద ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దేశంలోని నలుమూలల ప్రాంతాలకు వందే భారత్ రైళ్లు సర్వీసులు అందిస్తున్నాయి. వీటి ద్వారా వేలం మంది తమ ప్రయాణం చేస్తున్నారు.

1 / 5
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ సర్వీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో తరచూ వేలమంది ప్రయాణం చేస్తూ సౌకర్యవంతమైన సేవలు పొందగలుగుతున్నారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు వందే భారత్ రైళ్లల్లో అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ సర్వీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో తరచూ వేలమంది ప్రయాణం చేస్తూ సౌకర్యవంతమైన సేవలు పొందగలుగుతున్నారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు వందే భారత్ రైళ్లల్లో అందుబాటులో ఉన్నాయి.

2 / 5
మోడ్రన్ కిచెన్, వాష్ రూమ్స్‌తో పాటు మంచి ఫుడ్ కూడా వీటిల్లో లభిస్తోంది. ఎలాంటి అసౌర్యానికి గురి కాకుండా ప్రశాంతవంతమైన ప్రయాణం వీటిల్లో చేయవచ్చు. దీంతో వేగంగా ఏదైనా ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు వందే భారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లో ఆక్యూపెన్సీ కూడా భారీగా ఉంటుంది.

మోడ్రన్ కిచెన్, వాష్ రూమ్స్‌తో పాటు మంచి ఫుడ్ కూడా వీటిల్లో లభిస్తోంది. ఎలాంటి అసౌర్యానికి గురి కాకుండా ప్రశాంతవంతమైన ప్రయాణం వీటిల్లో చేయవచ్చు. దీంతో వేగంగా ఏదైనా ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు వందే భారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లో ఆక్యూపెన్సీ కూడా భారీగా ఉంటుంది.

3 / 5
అయితే త్వరలో రైలు ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. జనవరిలోనే ఢిల్లీ-పాట్నా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను భారతీయ రైల్వే ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఆ తర్వాత ఢిల్లీ-ముంబై మధ్య మరో స్లీపర్ రైలు ప్రవేశపెట్టనుండగా.. ఆ తర్వాత విడతల వారీగా దేశవ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు పెట్టనున్నాయి

అయితే త్వరలో రైలు ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. జనవరిలోనే ఢిల్లీ-పాట్నా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను భారతీయ రైల్వే ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఆ తర్వాత ఢిల్లీ-ముంబై మధ్య మరో స్లీపర్ రైలు ప్రవేశపెట్టనుండగా.. ఆ తర్వాత విడతల వారీగా దేశవ్యాప్తంగా పలు రూట్లలో పరుగులు పెట్టనున్నాయి

4 / 5
ఇప్పటికే ఆయా రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ కూడా పూర్తయింది. దీంతో త్వరలోనే ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు త్వరలో స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి.

ఇప్పటికే ఆయా రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్ రన్ కూడా పూర్తయింది. దీంతో త్వరలోనే ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 164 వందే భారత్ సర్వీసులు సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు త్వరలో స్లీపర్ రైళ్లు కూడా రానున్నాయి.

5 / 5
గత ఏడాది ప్రధాని మోదీ మొత్తం  42 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 25 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  భారత్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, ప్రపంచంలోనే అగ్రగామిగా రైల్వే వ్యవస్థను ఉంచేందుకు రైల్వేశాఖ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతోంది.

గత ఏడాది ప్రధాని మోదీ మొత్తం 42 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 25 వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. భారత్‌లో రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు, ప్రపంచంలోనే అగ్రగామిగా రైల్వే వ్యవస్థను ఉంచేందుకు రైల్వేశాఖ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెడుతోంది.