
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించేందుకు సిద్దమవుతోంది. తిరుపతి మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. తిరుమలకు వేగంగా చేరుకునేందుకు ఈ రైళ్లు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే త్వరలో తిరుపతికి మరో వందే భారత్ రైలు వచ్చే అవకాశముంది. తాజాగా ట్రయల్ రన్ కూడా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల తిరుపతి రైల్వే స్టేషన్లో కొత్త వందే భారత్ రైలు కనిపించింది. రైల్వే స్టేషన్లోని ఫిట్ లైన్పై ఇది ఆగింది. ఈ రైలులో ముందు, వెనుక లోకో పైలట్లు తప్ప ఎవరూ కనిపించలేదు. మొత్తం ఎనిమిది కోచ్లు ఈ రైల్లో ఉండగా.. వైట్ అండ్ బ్లూ కలర్తో ఉంది. తమిళనాడు నుంచి తిరుపతికి వరకు ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. తమిళనాడు వైపు నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి చేరుకుంది.

ట్రయల్ రన్స్లో భాగంగానే ఈ వందే భారత్ రైలు తిరుపతిలో ఆగినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ రైలు పట్టాలెక్కే అవకాశముందని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి రూట్ మ్యాప్ మాత్రం ఖరారు కాలేదు. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వందే భారత్ రైలును అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది. ట్రయల్ రన్ కోసమే తిరుపతికి చేరుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏపీ మీదుగా ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే వాటి సంఖ్య ఆరుకు చేరుకుంటుంది. అటు త్వరలో విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ సిద్దమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ వివరాలు కూడా ఇటీవల బయటకొచ్చాయి. త్వరలోనే ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ అందుబాటులోకి రానుంది.

తమిళనాడు నుంచి తిరుపతికి ఈ రైలు నడపనున్నారని అనధికార సమాచారం. ట్రయల్ రన్ నిర్వహించడంతో త్వరలోనే పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశముంది. ప్రస్తుతం తమిళనాడు నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ లేదు. దీంతో ఈ రూట్లోనే ట్రయల్ రన్ జరపడంతో ఆ రెండు ప్రాంతాల మధ్య నడపనున్నారని తెలుస్తోంది.