
Gold, Silver Prices: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ సెంటిమెంట్ను మరోసారి దెబ్బతీసి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి. ఇదిలా ఉండగా, బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరోసారి పుంజుకున్నాయి.

వెండి ధర రూ. 25,000 పెరిగింది. ఈ నెలలో మల్టీ కమోడిటీ మార్కెట్ (MCX)లో బంగారం ధర సుమారు రూ. 10,000 పెరగగా, వెండి ధర రూ. 25,000 పెరిగింది. ఇప్పటికి దాని ధర పెరుగుదల కొనసాగుతోంది. ఇటీవల భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

బంగారం ఎంత దూరం వెళ్తుంది? : యాక్సిస్ డైరెక్ట్ గతంలో 2026 నాటికి MCX గోల్డ్ 10 గ్రాములకు రూ.1.40 లక్షల నుండి రూ.1.45 లక్షల వరకు లక్ష్యాన్ని చేరుకుంది. మున్ముందు తులం బంగారం ధర రూ.1.60 లక్షలు దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండి ధరల పెరుగుదలకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది. డాలర్ కూడా బలహీనపడుతుండటం, బంగారం, వెండికి మద్దతునిస్తోంది.

అయితే ఆగస్ట్ 1వ తేదీన తులం బంగారం ధర రూ.1,44,220 ఉండగా, ప్రస్తుతం రూ.1,55,130 వద్ద ట్రేడవుతోంది. అంటే కేవలం అంటే కేవలం ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 13వ తేదీ మధ్య తులంపై ఏకంగా 10,910 రూపాయల వరకు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్లో ఆగస్ట్ 1వ తేదీన కిలో వెండి ధర రూ.2.35 లక్షలు ఉండగా, ఈ రోజు ఆగస్ట్ 13వ తేదీన రూ.1.60 లక్షల వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ 13 రోజుల్లోనే ఏకంగా 25 వేల రూపాయల వరకు పెరిగింది.