
డాలర్ బలపడటం, ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, అంతర్జాతీయ ఉద్రిక్తతల క్రమంలో గోల్డ్ రేట్లలో తగ్గుదల నమోదవుతోంది. ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా గోల్డ్ రేట్లు పడిపోగా.. వచ్చే వారంలో కూడా భారీగా కుప్పకూలే అవకాశముంది. ఈ వారం పొడవునా బంగారం ధరలు పతనమవ్వగా.. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి

మార్చి 13న గోల్డ్ రేటు రూ.1,58,399 వద్ద ఉండగా.. మార్చి 16 నాటికి రూ.1,55,714కి తగ్గింది. మార్చి 17న రూ.1,55,668కి పడిపోగా.. మార్చి 18న రూ.1,54,879కి డౌన్ అయింది. మార్చి 19న రూ.1,47,889 వద్ద ట్రేడ్ అవ్వగా.. మార్చి 20 నాటికి రూ.1,47,218 వద్ద ముగిసింది.

గత వారంతో పోలిస్తే ఈ వారంలో పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో సాధారణంగా గోల్డ్ రేట్లు పెరుగుతాయి. కానీ డాలర్ బలపడటం, మార్కెట్ల అస్థిరత, పెట్టుబడిదారులు నగదు అవసరాల కారణంగా బంగారాన్ని విక్రయించారు. దీని వల్ల గోల్డ్ రేట్లు తగ్గాయి

డాలర్ బలపడటం బంగారం డిమాండ్ను తగ్గించింది. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను సవరిస్తుందనే భయాలు ఒత్తిడిని పెంచాయి. ఇక పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారలు లాభాలను పొందారు. ఇక యుద్ద పరిస్థితుల క్రమంలో ముడి చమురు ధరలు పెరగడం ద్రవ్యోల్బణం భయాలను పెంచింది. బంగారం ధరల పతనానికి ఇవే కారణంగా చెప్పవచ్చు. ఈ వారంలో బంగారం ధరలు రూ.11 వేలు తగ్గాయి.

ఇక వెండి ధరలు కూడా కుప్పకూలాయి. మార్చి 13న కిలో సిల్వర్ రూ.2,60,488 వద్ద ఉండగా.. మార్చి 20 నాటికి రూ.2,32,364కి తగ్గిపోయింది. ఈ వారంలో మొత్తం రూ.28 వేల మేర క్రాష్ అయింది. బంగారంతో పోలిస్తే సిల్వర్ ధరల తగ్గుదల ఎక్కువగా ఉంది. ఆర్ధిక అనిశ్చితి వల్ల ధరలు తగ్గాయని చెప్పవచ్చు.