
సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. భానుడు తన రేంజ్లో ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి నెలలోనే ఎండ తీవ్రత ఇలా ఉందంటే.. మే నెలలో ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ ఎండల కారనంగా.. చర్మం రంగు కూడా మారిపోతుంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతాయి.

వేసవిలో కూడా మీ చర్మం బాగుండాలంటే.. తగినన్ని జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాలి. దీంతో చర్మ కణాలు పాడవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి. స్కిన్ని హెల్దీగా ఉంచడంలో రోజ్ వాటర్ చక్కగా పని చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది కూడా.

ఓ బౌల్లో ముల్తానీ మట్టి రెండు స్పూన్లు, రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా రబ్ చేసుకుంటూ ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

ఈ చిట్కా కూడా బాగా పని చేస్తుంది. రెండు స్పూన్ల కాఫీ పౌడర్లో రోజ్ వాటర్ వేసి బాగా కలిపి.. ముఖానికి, మెడకు అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడూ చేస్తే.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగి.. ఫేస్ గ్లో అవుతుంది.

అదే విధంగా రెండు స్పూన్ల శనగ పిండిలో.. కొద్దిగా రోజ్ వాటర్ కలిపి.. మెడ, ముఖం, చేతల భాగాల్లో అప్లై చేయాలి. ఓ పావుగంట తర్వాత సున్నితంగా రబ్ చేస్తూ.. ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే.. ఫేస్పై పేరుకున్న మురికి పోయి కాంతివంతంగా తయారవుతుంది.