
మనం ఎన్నో మామిడి పండ్లను చూశాము కానీ వాటిలో ఇది చాలా స్పెషల్ గురు ఎందుకంటే ఇది అంత ప్రత్యేకమైనది. ఇక ధరలో అయితే నాన్ వెజ్ తో పోటీ పడుతుంది. అదే బ్లాక్స్టోన్ మామిడి. కిలో ధర వేలల్లో పలుతుకున్నా కూడా వీటికోసం జనం ఎగబడిమరి కొంటున్నారు. అసలు ఇది ఎందుకంత ప్రత్యేకమైనదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్లోని జవహర్ ఉద్యాన్లో ఈ మామిడి పండ్లు పండుతున్నాయి అక్కడ ఈ తోట చాలా ఫేమస్. ఇంకా చెప్పాలంటే దీనిలో 150 కుపైగా రకాల పండ్లనిచ్చే ఎన్నో వందల మామిడి చెట్లు ఉన్నాయి. వాటిలో ఈ బ్లాక్స్టోన్ మామిడి స్పెషల్. కానీ, ఒక కేజీ బ్లాక్ స్టోన్ మామిడి కొనాలంటే రూ.4వేల నుంచి రూ.6 వేలు ఖర్చు అవుతాయి.

భోపాల్లో ఉండే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యూనిట్ దగ్గర్లోనే ఈ జవహర్ ఉద్యాన్ ఉంది. ఇంకా ఈ తోటను బీహెచ్ఈఎల్ చూసుకుంటుంది. ఇక్కడ సాఫ్రాన్, నూర్జహాన్, మాల్దా, హాపుస్, దషెహ్రి, మధుకామిని, బ్లాక్ గోల్డ్, బ్లాక్ స్టోన్ వంటి కొత్తరకాల మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం వెళ్ళి చూస్తే ఆ చెట్లు అన్ని చూసి వామ్మో ఇన్ని చెట్లా అని అనకుండా ఉండలేము.

అయితే, ఈ ఉద్యాన్లో పండే బ్లాక్ స్టోన్ మామిడి పండ్ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కేజీ కిలో బ్లాక్ స్టోన్ మామాడి పండ్ల ధర రూ.6వేలు పలుకుతున్నాయి. ఎందుకంటే, ఇవి ఇక్కడ జాతి కాదు. ఫ్రాన్స్ దేశానికి చెందిన మామిడి. ఈ మామిడి పండ్లు పచ్చ రంగులో కాకుండా నలుపు, పర్పుల్ కలర్లో ఉంటాయి.

ఇంకా వీటిలో పీచు కూడా ఉండదు ఇవి అందుకే అంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి మాములు మామిడి పండ్ల కన్నా భిన్నమైన ఘాటైన వాసనతో ఉంటుంది. అందుకే ధరలో నాన్ వెజ్ తో పోటీ పడుతుంది. దీని ధర ఎప్పుడు ఎక్కువే ఉంటుందని బీహెచ్ఈఎల్ టీమ్ తెలిపారు.