
టీమిండియాకు దూరమైన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన భువీ.. హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు.

టీ20 క్రికెట్లో భువీకి ఇదే తొలి హ్యాట్రిక్. ఈ హ్యాట్రిక్తో భువనేశ్వర్ కుమార్ RCB అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ జార్ఖండ్పై హ్యాట్రిక్ వికెట్ తీశాడు. భువనేశ్వర్ కుమార్ 17వ ఓవర్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఓవర్ తొలి మూడు బంతుల్లోనే భువనేశ్వర్ కుమార్ వరుసగా వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్ 17వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేసేందుకు వచ్చే సమయానికి జార్ఖండ్ జట్టు 116 పరుగులు చేసింది. ఆ ఓవర్ తొలి బంతికి 11 పరుగులు చేసిన రాబిన్ మింజ్ను ఔట్ చేసిన భువీ, అదే ఓవర్ రెండో బంతికి బాలకృష్ణను అవుట్ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి వివేకానంద తివారీ ఔటయ్యాడు.

నిజానికి భువీ హ్యాట్రిక్ వికెట్ ఆర్సీబీకి బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లు చెల్లించి భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో భువనేశ్వర్కు ఇదే అతిపెద్ద జీతం అని చెప్పవచ్చు.

గతంలో హైదరాబాద్ 4.2 కోట్లుకు భువీని కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇప్పటివరకు భువీ 7 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు.