
మీరు ఎక్కడైనా వెళ్లాలని ప్లాన్ ఉంటే మీ సెలవులను రాముడి నగరమైన అయోధ్యకు వెళ్లవచ్చు.ఇక్కడ రామమందిరంతో పాటు అనేక ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చు. విశేషమేమిటంటే మీ మొత్తం ట్రిప్ మీ బడ్జెట్లోనే పూర్తవుతుంది.

పర్యాటక ప్రదేశాల నుంచి హోటళ్ళు, ధర్మశాల, ఇక్కడికి ఎలా చేరుకోవాలో దాని గురించి తెలుసుకోండి.

మీరు రైలు మార్గంలో ఢిల్లీ నుంచి అయోధ్య చేరుకోవాలనుకుంటే ఈ రైళ్ల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇందులో ఫైజాబాద్ ఢిల్లీ ఎక్స్ప్రెస్, ఫరక్కా ఎక్స్ప్రెస్, కైఫియత్ ఎక్స్ప్రెస్, సద్భావనా ఎక్స్ప్రెస్, ఆనంద్ విహార్ టెర్మినల్ వంటి రైళ్లు ఉన్నాయి.

రామజన్మభూమి, హనుమాన్గర్హి, కనక్ భవన్ సమీపంలో చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఇందులో బిర్లా ధర్మశాల, శ్రీ ధర్మశాల, మహారాష్ట్ర ధర్మశాల, వైధ్జీస్ ధర్మశాల, రామ్ శ్యామ్ హోటల్, చంద్ర గెస్ట్ హౌస్, హనుమంత్ ప్యాలెస్ ఉన్నాయి.

మరోవైపు, AC గది గురించి మాట్లాడినట్లయితే, దాని అద్దె రూ. 2000 నుంచి రూ.2200 వరకు ఉంటుంది. దీని ధరలు కూడా కాలానుగుణంగా మారవచ్చు. మీరు అయోధ్యలోని కనక్ భవన్, హనుమాన్ గర్హి, గులాబ్ బధి, రాజ మందిర్, త్రేతా కే ఠాకూర్, రామకథా పార్క్ వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు.