
పల్లెటూరి పొలం కారం పచ్చడి చాలా ఫేమస్. పొలాల్లో దొరికే పచ్చి మిర్చితో చేస్తే ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా వేడి అన్నంలో కూడా తినొచ్చు అలా తింటే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి జన్మలో మర్చిపోరు.

పొలం పచ్చి కారం పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల పచ్చిమిర్చి , మూడు ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు , ఒక కట్ట కొత్తిమీర ఆకులు, కొద్దిగా కరివేపాకు ఆకులు , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా కొద్దిగా చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు , ఒక టీ స్పూన్ మినప్పప్పు , కట్ చేసిన ఎండు మిర్చిని తీసుకోవాలి.

పచ్చిమిర్చి - ఉల్లిపాయ : ముందుగా 100గ్రాముల పచ్చిమిర్చిని తీసుకుని రెండు మూడుసార్లు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండును తీసుకుని కూడా దానిని బాగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసి మంచిగా నానబెట్టుకోవాలి. అయితే, దీని నుంచి గుజ్జు తీసేలా నాననివ్వాలి. ఇక ఇప్పుడు ఉల్లిపాయలను కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇక ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసి రోటిలో వేసి దంచుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులు కూడా వేసి వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో లోకి తీసుకోండి. గ్యాస్ పొయ్యి మీద మళ్ళీ ఇంకోసారి పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు పెట్టి ఈ పచ్చడి మీద పోయాలి. అంతే, రోటి పొలం కారం పచ్చడి రెడీ

ఈ పొలం కారం పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటేప్రతి ముద్దకు ఇక స్వర్గమే. వీటిని ఎక్కువగా జొన్న రొట్టెలు, చపాతీలతో ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో సహజమైన పోషకాలున కూడా ఉంటాయి. ఇది జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అలాగే, ఆకలి లేని వారు దీనిని తింటే ఆకలి కూడా పెంచుతుంది.