August 31 Deadline Alert: ఈ మూడు పనులు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశం.. లేకపోతే ఇబ్బందులే..

|

Aug 31, 2022 | 9:11 AM

August 31 Deadline Alert: ఆగస్ట్ నెల ఈ రోజుతో ముగియబోతోంది. సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. అయితే కొన్ని ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ రోజుతో గడువు ముగియనుంది. లేకపోతే ఇబ్బందులు..

1 / 3
ITR వెరిఫికేషన్: మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే మీరు దాని వెరిఫికేషన్ పనిని 1 నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారికి దాని వెరిఫికేషన్ కోసం కేవలం 30 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే వినియోగదారులకు తెలియజేసింది. మీరు మీ రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుండా మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు.

ITR వెరిఫికేషన్: మీరు జూలై 31, 2022 తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసి ఉంటే మీరు దాని వెరిఫికేషన్ పనిని 1 నెలలోగా అంటే 30 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 31 గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేసిన వారికి దాని వెరిఫికేషన్ కోసం కేవలం 30 రోజులు మాత్రమే అవకాశం ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే వినియోగదారులకు తెలియజేసింది. మీరు మీ రిటర్న్‌ను ఆగస్టు 1న ఫైల్ చేసి ఉంటే మీ వెరిఫికేషన్ గడువు ఆగస్ట్ 31తో ముగుస్తుంది. ధృవీకరణ లేకుండా మీ ITR రిటర్న్ పూర్తయినట్లు పరిగణించబడదు.

2 / 3
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లు: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే, ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుతో గడువు ముగియనుంది. గడువు పెంచుతారా..? లేదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. నిర్లక్ష్యం చేయకుండా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌. లేకపోతే మీ బ్యాంకు ఖాతా స్తంభించిపోతుంది. ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇప్పటికే సదరు బ్యాంకు ట్విట్టర్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా ఖాతాదారులకు తెలియజేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లు: మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ అయితే, ఆగస్టు 31లోపు మీ ఖాతా KYCని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుతో గడువు ముగియనుంది. గడువు పెంచుతారా..? లేదా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. నిర్లక్ష్యం చేయకుండా ఈ పని పూర్తి చేసుకోవడం బెటర్‌. లేకపోతే మీ బ్యాంకు ఖాతా స్తంభించిపోతుంది. ఎలాంటి లావాదేవీలు జరగవు. ఇప్పటికే సదరు బ్యాంకు ట్విట్టర్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా ఖాతాదారులకు తెలియజేసింది.

3 / 3
PM కిసాన్ పథకం లబ్ధిదారులు: ఈ పథకం కోసం KYC గడువును ప్రభుత్వం 31 ఆగస్టు 2022 వరకు ఉంది. ఈకేవైసీ చేయని వారు ఈ రోజు పూర్తి చేస్తే మీకు 12వ విడత డబ్బులు మీ ఖాతాల్లో చేరుతాయి. లేకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.

PM కిసాన్ పథకం లబ్ధిదారులు: ఈ పథకం కోసం KYC గడువును ప్రభుత్వం 31 ఆగస్టు 2022 వరకు ఉంది. ఈకేవైసీ చేయని వారు ఈ రోజు పూర్తి చేస్తే మీకు 12వ విడత డబ్బులు మీ ఖాతాల్లో చేరుతాయి. లేకపోతే డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది.