
ఈ మధ్యకాలంలో బంగారం వెండిధరలు భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తు్న్నాయి. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగాయి, ఇక ధరల్లో తగ్గుదల ఉండదు అని భావించే క్రమంలో ఒక్కసారిగా జనవరి 30న బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. అంతే కాకుండా వెండి, బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు అయోమయ పరిస్థితులకు లోను అవుతున్నారు, అసలు ధరలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కాగా, దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

గత సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తున్న, బంగారం వెండి ధరలు స్థిరపడే దశలో ఉన్నాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా 2026లో ఏర్పడే, సూర్య , చంద్ర గ్రహణాల ప్రభావం దీనిపై ఎక్కువ మొత్తంలో ఉండనున్నదంట.

అలాగే ఈ సంవత్సరం పంచగ్రహ కూటమి కూడా ఏర్పడటం వలన, గ్రహాల ప్రభావం, గ్రహణాల ప్రభావం వలన బంగారం, వెండి ధరలు బ్రేక్ ఈవెన్ స్థితిలో ఉండనున్నాయంట. గ్రహాల కూటమి శ్రీఘ్రగతిని కలగడం వలన ప్రపంచ వ్యాప్తంగా అస్థిరత ఏర్పడే అవకాశం ఉంన్నదంట.

ఈ సంవతస్సరం పరాభవ నామ సంవత్సరం కావడం వలన, 2026లో ఆర్థిక, రాజకీయ అస్థిరతలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. చాలా మంది ప్రజలు, బంగారం, వెండిపై పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారంట.

మరీ ముఖ్యంగా గ్రహణాల ముందు భారీగా పడిపోయిన ధరలు, గ్రహణాల తర్వాత విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నదని వారు తెలియజేస్తున్నారు. అందువలన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు, ప్రస్తుత పరిస్థితులను చూస్తూ నిర్ణయాలు తీసుకోవాలంట. లేకపోతే ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంటుందంట.