మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్క అరెస్ట్
కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ మావోయిస్టు పద్మావతి అలియాస్ పద్మక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో మాజీ మావోయిస్టు, పీపుల్స్ వార్ మాజీ సభ్యురాలు పద్మావతి అలియాస్ పద్మక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల నుంచి బెంగుళూరుకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా నంద్యాల మండలం రైతునగర్ వద్ద పట్టుకున్నారు. ఆమెను కర్నూలులో విచారించిన పోలీసులు.. అనంతరం నంద్యాల తహసీల్దార్ ఎదుట హాజరు పరిచారు. ప్రకాశం జిల్లాకు చెందిన పద్మావతి గత కొన్నిరోజులుగా ఆమె సోదరుడు రిటైర్డ్ ఉద్యోగి బాలశేఖర్ ఇంట్లో ఉంటుంది.
Also Read : తెలంగాణ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600కోట్లు విడుదల