Mummidivaram: దేవుడు వీరిద్దరినీ జత కలిపాడు.. వరుడు రెండడుగులు.. వధువు నాలుగడుగులు.. ఫొటో వైరల్

East Godavari: ప్రతీ వ్యక్తి ఓ పరిపూర్ణ జీవిత భాగస్వామిని కోరుకుంటాడు. అందం, అభినయం విషయంలో వరుడికి, వధువుకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంకా సరైన ఎత్తు, కలర్ వంటివి కూడా చాలా మందిని

Mummidivaram: దేవుడు వీరిద్దరినీ జత కలిపాడు.. వరుడు రెండడుగులు.. వధువు నాలుగడుగులు.. ఫొటో వైరల్
Mummidivaram
Follow us

|

Updated on: Apr 07, 2021 | 5:09 PM

East Godavari: ప్రతీ వ్యక్తి ఓ పరిపూర్ణ జీవిత భాగస్వామిని కోరుకుంటాడు. అందం, అభినయం విషయంలో వరుడికి, వధువుకి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇంకా సరైన ఎత్తు, కలర్ వంటివి కూడా చాలా మందిని ఆకర్షిస్తాయి. ఇవన్నీ మన ముచ్చటేగానీ.. సరైన జోడిని భగవంతుడే జతకలుపుతాడని మన పెద్దవాళ్లంతా చెబుతుంటారు. దేవుడు ఆదేశించాలేగానీ.. కలర్, ఎత్తు, అందం ఇవేమీ ఉండదని.. ఇక జీవితంలో ప్రేమా, ఆప్యాయతలే ఉంటాయని పేర్కొంటుంటారు. ఇలాంటి ఒక జంటను దేవుడు ఆంధ్రప్రదేశ్‌లో కలిపాడు. ఈ పెళ్లి గురించి అంతటా చర్చ జరుగుతోంది. ఈ వివాహం ప్రత్యేకత ఎంటంటే.. వధూవరులే.. అవునండీ.. వరుడు రెండు అడుగులు ఉంటే.. వధువు నాలుగు అడుగులు ఉంది.

ఈ వివాహం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. ఈ పెళ్లిని చూసినవారంతా జంట చూడముచ్చటగా ఉందంటూ దీవించారు. ముమ్మిడివరం స్థానిక చర్చిలో జరిగిన ఈ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుడు దేవరపల్లి శ్రీనివాస్.. బాల్యం నుంచే ఎత్తు పెరగడం ఆగిపోయింది. శ్రీనివాస్ కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండటంతో.. ప్రజలు ఎలా పెళ్లి చేసుకుంటాడోనని పేర్కొనేవారు. కానీ శ్రీనివాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతని కుటుంబం సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇదే జిల్లా సమనస గ్రామంలో నివసించే సత్య దుర్గ శ్రీనివాస్, ఆయన కుటుంబానికి నచ్చింది. సత్య దుర్గ పొడవు కూడా నాలుగు అడుగులే.. సత్య దుర్గ ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకుంది.

Mummidivaram East Godavari

ఇద్దరు మనసులు కలవడంతో పెద్దలు మార్చి 31 న శాంతినగర్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహాన్ని చూసినవారంతా జంట చూడముచ్చటా ఉందంటూ దీవించారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరి దీవెనలు పొందుతోంది.

Also Read:

Chhatisgarh encounter: సీఎం జగన్ కీలక ఆదేశాలు.. ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున సాయం..