బీజేపీలో ‘నాలుగు భారీ ఖాళీలు’, అందరిచూపు వాటిపైనే !

| Edited By: Anil kumar poka

Aug 29, 2020 | 1:17 PM

బీజేపీలో ఏర్పడిన నాలుగు ఖాళీలపై పలువురు నేతల చూపు పడింది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ దివంగతులయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తున్నారు.

బీజేపీలో నాలుగు భారీ ఖాళీలు, అందరిచూపు వాటిపైనే !
PM Modi- Amit Shah
Follow us on

బీజేపీలో ఏర్పడిన నాలుగు ఖాళీలపై పలువురు నేతల చూపు పడింది. మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్ దివంగతులయ్యారు. ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానాన్ని ఆశిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఏర్పడిన ఈ ఖాళీలను ఎప్ఫడెప్పుడు భర్తీ చేస్తారా, మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. నాగ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయం వీరి రాకపోకలతో సందడిగా ఉంటోంది. ఆ మధ్య బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో సుమారు గంటసేపు స మావేశమయ్యారు.

ప్రస్తుతం బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, థావర్ చంద్ గెహ్లాట్, బీ ఎల్. సంతోష్, జేపీ నడ్డా సభ్యులుగా ఉన్నారు. కొందరు మంత్రులను పార్టీ పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవచ్ఛు. ఆశావహులంతా ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ తో బాటు జేపీ నడ్డా వైపుకూడా ‘ఆశ’గా చూస్తున్నారు. మరి మోదీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణకు  ముహూర్తం ఖరారు కాగానే వీరంతా పొలోమంటూ తమ ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.