‘ సారీ అమ్మా ! మీ వారు నీ బర్త్ డే కి మిస్సయ్యారు ‘ !

|

Sep 23, 2019 | 2:53 PM

హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఈ విషయం తెలిసిన మోదీ.. ఆమెకు క్షమాపణ (సారీ) చెబుతున్న వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది. ‘ […]

 సారీ అమ్మా ! మీ వారు నీ బర్త్ డే కి మిస్సయ్యారు  !
Follow us on

హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఈ విషయం తెలిసిన మోదీ.. ఆమెకు క్షమాపణ (సారీ) చెబుతున్న వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది. ‘ ఈ రోజున మీకు క్షమాపణ చెబుతున్నాను.. ఇందుకు కారణం మీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి మీ భర్త హాజరు కాలేకపోయారు. ఆయన నా వెంటే ఉన్నారు. అందువల్ల సహజంగానే మీరు నాపట్ల అసూయతో ఉండి ఉంటారు ‘ అని ఆమెతో ఛలోక్తిగా అన్నారు. (ఆ సందర్భంలో మోడీ పక్కనే జాన్ కూడా ఉన్నారు). ‘ మీ ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నానని, మీ భవిష్యత్తు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుతున్నానని ‘ మోదీ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఆరున్నరవేలకు పైగా లైక్స్, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చిపడ్డాయి. అన్నట్టు జాన్ కార్నిన్ దంపతులది 40 ఏళ్ళ వైవాహిక జీవితం. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.