‘ మేమే గెలుస్తాం ‘.. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా

| Edited By: Ravi Kiran

Dec 23, 2019 | 2:55 PM

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ […]

 మేమే గెలుస్తాం .. జార్ఖండ్ సీఎం రఘువర దాస్ ధీమా
Follow us on

ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ వెనుకబడింది. చూడబోతే కమలం పార్టీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగులవచ్ఛునని తెలుస్తోంది. అయితే తాము విజయం సాధించి తీరుతామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం, బీజేపీ నేత రఘువర్ దాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జంషెడ్ పూర్ ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థికన్నా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ‘ అబ్ కీ బార్ 65 పర్ ‘ అనే స్లోగన్ ని ఎత్తుకుంది. కానీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా- కాంగ్రెస్ కూటమి నుంచి ఊహించని ‘ దెబ్బ ‘ ను ఎదుర్కొంటోంది.

ఝార్ఖండ్ లో బీజేపీ, జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలతో బాటు ఆర్జేడీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా ప్రజా తాంత్రిక్ వంటి పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ.. ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ తో పొత్తు పెట్టుకుంది. (ఈ పార్టీ 5 సీట్లు గెలుచుకుంది). అయితే ఈ సారి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్..బీజేపీతో పొత్తు వదులుకుని ఒంటరిగా బరిలోకి దిగింది.
అటు- ఈ ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తున్నట్టు వార్తలు రావడంతో ముఖ్యంగా కాంగ్రెస్ శిబిరాల్లో హర్షం వ్యక్తమవుతోంది.