లండన్ నుంచి ముంబైలో అడుగు పెట్టిన భారతీయులు

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. లండన్ నుంచి 326 మంది భారతీయులు ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు...

లండన్ నుంచి ముంబైలో అడుగు పెట్టిన భారతీయులు

Edited By:

Updated on: May 10, 2020 | 11:28 AM

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. లండన్ నుంచి 326 మంది భారతీయులు ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు.  ఈ ఇండియన్స్ తో కూడిన విమానం శనివారం సాయంత్రం లండన్ నుంచి బయల్దేరిందని, ప్రయాణికులు ఓపికగా ఇన్ని గంటలు గడిపారని అక్కడి భారతీయ హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఇలా ఉండగా నిన్న దుబాయ్, కువైట్, మస్కట్, షార్జా, కౌలాలంపూర్, డాకా నుంచి మరింతమంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు మొదలైంది. ఇందుకు 64 విమానాలను రంగంలోకి దింపారు.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us