
పిల్లలు సాధారణంగా తమ తల్లితండ్రి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు, కానీ అజంగఢ్లోని అహ్రౌలాలో, 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రి వివాహ ఏర్పాట్లను ఆపడానికి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. తన తండ్రి ఏడవ వివాహానికి సిద్దమవుతున్నాడని బాలుడు కేసు పెట్టాడు. వెంటనే పెళ్లి ఆపి న్యాయం చేయాలంటూ ఆ మైనర్ కుమారుడు పోలీసులను వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్ జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తో్ంది.
ఈ ఘటన అజంగఢ్లోని ఒక గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అక్కడ 55 ఏళ్ల వ్యక్తిపై అతని సొంత కొడుకు తీవ్రమైన లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపించాడు. కొడుకు చెప్పిన దాని ప్రకారం, అతని తండ్రి ఆరుసార్లు వివాహం చేసుకున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే, అతని మూడవ భార్య కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 2024లో తన తండ్రి ఆరోసారి వివాహం చేసుకున్నాడని, కానీ అతని భార్య కొద్ది రోజుల్లోనే భూమి, నగలు డిమాండ్ చేస్తూ కుటుంబాన్ని విడిచిపెట్టిందని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు ఆ కొడుకు వెల్లడించాడు. ఇప్పుడు కూడా, ఆ వ్యక్తి పట్టు వదలలేదు. ఏడవసారి వివాహం చేసుకోబోతున్నాడని తెలిపాడు.
ఆ కొడుకు బాధ తండ్రి వివాహాలకే పరిమితం కాలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా దిగజారుతోంది. తన తండ్రి వృద్ధుడయ్యాడని, తన ఏడవ వివాహానికి నిధులు సమకూర్చుకోవడానికి పూర్వీకుల భూమిని అమ్మాలని నిశ్చయించుకున్నాడు. ఆ భూమిని అమ్మడానికి 50,000 రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని కొడుకు చెబుతున్నాడు. ఆశ్చర్యకరంగా, తండ్రి ఇప్పటికే సగం భూమిని తనఖా పెట్టాడు. కొడుకు అప్పును స్వయంగా చెల్లిస్తున్నాడు.
ఈ విషయం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) చిరాగ్ జైన్ వద్దకు చేరడంతో, కథ మరో మలుపు తిరిగింది. ఈ కేసులో బహుళ వివాహాలు మాత్రమే కాకుండా, భూమి, ఆస్తి విభజన కూడా ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం, వివాహ రికార్డులు, భూమి ఒప్పందాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..