Amit Shah on Caste Survey: ‘ముస్లింలు-యాదవుల సంఖ్యను ఉద్దేశపూర్వకంగా పెంచారు’- అమిత్ షా

బీహార్ రాష్ట్ర సర్కార్ చేపట్టిన కులాల సర్వేపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5 ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేలో ఉద్దేశపూర్వకంగా చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ముస్లింలు, యాదవుల జనాభాను పెంచిందని ఆరోపించారు.

Amit Shah on Caste Survey: ముస్లింలు-యాదవుల సంఖ్యను ఉద్దేశపూర్వకంగా పెంచారు- అమిత్ షా
Amit Shah

Updated on: Nov 05, 2023 | 6:01 PM

బీహార్ రాష్ట్ర సర్కార్ చేపట్టిన కులాల సర్వేపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 5 ముజఫర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన బీహార్‌లోని నితీష్‌కుమార్ ప్రభుత్వం కుల ఆధారిత సర్వేలో ఉద్దేశపూర్వకంగా చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ముస్లింలు, యాదవుల జనాభాను పెంచిందని ఆరోపించారు.

ముజఫర్‌పూర్‌లోని పటాహిలో పార్టీ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీహార్‌లో కుల గణనను నిర్వహించాలని నితీశ్‌ కుమార్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌‌లో భాగమైనప్పుడే నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా గుర్తు చేశారు. కులాలా లెక్కలకు బీజేపీ వ్యతిరేకంగా కాదన్నారు షా. ప్రతిపక్ష పార్టీల భారత కూటమిపై దాడి చేస్తూ, భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించడమే ఈ కూటమి ఏకైక ఎజెండా అని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు.

నితీష్ కుమార్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అది ఏ మాత్రం నెరవేరడం లేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. నితీష్‌ను భారత కూటమికి కన్వీనర్‌గా కూడా చేయలేదు.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 40 సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, గత ఏడాది జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మహా కూటమిలో చేరింది. భారత కూటమిలో జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) కూడా ఉన్నాయి.

బీహార్‌లో గూండాయిజాన్ని తిరిగి తీసుకురావడానికి నితీష్‌ కారణమని, లాలూ-నితీష్‌ కుమార్‌ ద్వయం ఎప్పుడూ వెనుకబడిన ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా హోంమంత్రి బీహార్ ప్రజలకు ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నిర్వహించిన కులాలవారీ సర్వే ఫలితాలు గత నెలలో బహిర్గతమయ్యాయి. ఇదిలావుంటే, సర్వే ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం జనాభాలో OBC, EBC లు 60 శాతానికి పైగా ఉన్నారని బీహార్ సర్కార్ ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…