Tomato Prices: పెరుగుతున్న టమాట ధరలు.. ఒక్కసారిగా ధరలు డబుల్, ఎందుకంటే

టమాట ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ధర్మపురి మార్కెట్ లో టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాగును కొనసాగించడానికి నీరు లేకపోవడమే తక్కువ దిగుబడికి కారణమని రైతులు చెబుతున్నారు. వారం క్రితం కిలో రూ.9 నుంచి రూ.10కి విక్రయించిన ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి.

Tomato Prices: పెరుగుతున్న టమాట ధరలు.. ఒక్కసారిగా ధరలు డబుల్, ఎందుకంటే
Tomoto

Updated on: Mar 15, 2024 | 1:19 PM

టమాట ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ధర్మపురి మార్కెట్ లో టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాగును కొనసాగించడానికి నీరు లేకపోవడమే తక్కువ దిగుబడికి కారణమని రైతులు చెబుతున్నారు. వారం క్రితం కిలో రూ.9 నుంచి రూ.10కి విక్రయించిన ధరలు ఇప్పుడు దాదాపు రెట్టింపు అయ్యాయి. తమిళనాడులోని ధర్మపురిలో ఏటా 6 వేల హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు. ఎక్కువగా చిన్న తరహా రైతులు స్థిరమైన ఆదాయ వనరుగా భావించి పంటను పండిస్తారు. సరఫరా లేకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యవసాయ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నీరు లేకపోవడంతో సాగును కొనసాగించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. పాలకోడ్ కు చెందిన ఆర్. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పాలకోడ్ పరిసర ప్రాంతాల్లో టమోటాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.

వీటిని సాగు చేయడం సులభం, తక్కువ నీరు అవసరం. బిందు సేద్యం, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి బాగుంది. కాబట్టి దీనిని తరచుగా చిన్న రైతులు ఎంచుకుంటారు. కానీ ఇటీవల నీటి వనరులు లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. చాలా మంది వేసవిలో ఇతర ఉపాధి కోసం ముందు జాగ్రత్త చర్యగా ఉత్పత్తిని కూడా నిలిపివేశారు. కాబట్టి సరఫరా తగ్గడానికి ఇదే కారణం కావచ్చు” అని ఆయన అన్నారు.

గత కొన్ని నెలలుగా ధరలు సంతృప్తికరంగా లేవని, ఇది కూడా ఉత్పత్తి తగ్గడానికి కారణమై ఉండొచ్చని కె.రాజేంద్రన్ అనే రైతు తెలిపారు. గత నెలలో కిలో రూ.9 లేదా రూ.10 మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితిలో ఇది నష్టమే. కాబట్టి రైతులు ఉత్పత్తిని నిలిపివేయవచ్చు అని అన్నారు. హోల్ సేల్ వ్యాపారి ఆర్.గణేశన్ మాట్లాడుతూ – ”ప్రస్తుతం పాలకోడ్ టమోటా మార్కెట్లో 8 టన్నులకు పైగా టమోటాలు వస్తున్నాయి. సాధారణంగా ఈ నెలలో 20 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. పీక్ సీజన్లో 700 నుంచి 800 టన్నుల దిగుబడి వస్తుంది. ఇప్పుడు 20 టన్నులు మాత్రమే వస్తున్నాయి. సరఫరా తక్కువగా ఉన్నప్పటికీ ధరలు అంత ఎక్కువగా లేవు. 35 కిలోల బాక్సు రూ.250 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని అన్నాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు స్థిరంగా ఉన్నా.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.

Follow Us