Tamil Nadu: ఫ్రిజ్ డోర్ తెరిచి చనిపోయిన ఐదేళ్ల చిన్నారి.. షాక్‌కు గురి చేస్తున్న ఘటన..!

|

Aug 07, 2024 | 6:43 PM

ఫ్రిజ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా చనిపోతారా? ఇది కాస్త వింతగా అనిపించవచ్చు కానీ అది జరిగింది. ఫ్రిజ్ తెరిచిన తర్వాత ఓ చిన్నారి మృతి చెందింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బాలిక ఫ్రిజ్‌ తెరిచి ప్రాణాలు కోల్పోయింది.

Tamil Nadu: ఫ్రిజ్ డోర్ తెరిచి చనిపోయిన ఐదేళ్ల చిన్నారి.. షాక్‌కు గురి చేస్తున్న ఘటన..!
Shock
Follow us on

ఫ్రిజ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరైనా చనిపోతారా? ఇది కాస్త వింతగా అనిపించవచ్చు కానీ అది జరిగింది. ఫ్రిజ్ తెరిచిన తర్వాత ఓ చిన్నారి మృతి చెందింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో ఆడుకుంటున్న బాలిక ఫ్రిజ్‌ తెరిచి ప్రాణాలు కోల్పోయింది.

ఒకటో తరగతి చదువుతున్న ఆవడి నందవన్ మెట్టూరులో నివాసం ఉంటున్న గౌతమ్‌ 5 ఏళ్ల కుమార్తె రూపవతి. ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో ఆడుకుంటుండగా ఫ్రిజ్ దగ్గరకు చేరుకుని డోర్ తెరవగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆవడి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి తరలించేలోపే బాలిక మృతి చెందినట్లు వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు.

బాలిక మృతితో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో కలకలం రేపింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గౌతమ్ ప్రియ దంపతులు చెన్నై అవడి నివాసి. మహిళా స్వయం సహాయక సంఘంలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. గత నెలలోనే దంపతులు ఆవడికి వెళ్లారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఇందులో పెద్ద కూతురు రూపవతి.

ఎప్పటిలాగే రూపవతి నిన్న అంటే మంగళవారం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఆడుకుంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సమయంలో, ఆమెకు ఆకలిగా అనిపించి, ఫ్రిజ్ నుండి అల్పాహారం తీసుకోవడానికి వెళ్లింది. ఆపై అకస్మాత్తుగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. రిఫ్రిజిరేటర్ చాలా పాతదని, దీంతో బాలిక విద్యుదాఘాతానికి గురైందని విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ ఘటనతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. చిన్నారి మృతికి గల కారణాలపై మరో కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..